యాదాద్రి, ఫిబ్రవరి 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత వేగంగా.. నాణ్యతతో చేపడుతున్నారు. ప్రధానాలయ పనులు దాదాపు పూర్తికాగా.. భక్తుల వసతుల కల్పన పనులు తుది దశకు చేరుకొన్నాయి. యాదాద్రి కొండ నుంచి కిందికి వచ్చేందుకు ప్రత్యేకంగా నిర్మించిన ఎగ్జిట్ ఫ్లైఓవర్ పనులు పూర్తికావచ్చాయి. ఫ్లై ఓవర్ నుంచి కిందకు నీరు కారకుండా ఉండేందుకు శనివారం వాటర్ ప్రూఫింగ్ పనులు చేపట్టారు. మొత్తం మూడు రకాల పూతలను వేశారు. ఇందులో మొదటిది 1 ఎంఎం మందంతో పసుపు వర్ణపు పూత, రెండోది 1 ఎంఎం మందంతో బూడిద రంగుతో పూత, చివరగా బాండింగ్ పూతతో నీటి లీకేజీ లేకుండా సీజ్ చేసినట్టు వైటీడీఏ అధికారులు తెలిపారు.