చిల్పూరు, ఏప్రిల్ 17 : పంట చేతికి రా క.. అప్పుల భారం మోయలేక జనగామ జిల్లా చిల్పూరు మం డలం వెంకటాద్రిపేట లో బుధవారం ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపేట కు చెందిన రైతు నాగారపు సుభాష్ (40) తనకున్న ఎకరం భూమితోపాటు రెండేండ్ల క్రితం మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో వరి, మక్కజొన్న పంటలు వేశాడు. సాగునీరులేక పంట చేతికి రాలేదు. రూ.6 లక్షల వరకు అప్పు అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి అతడిని దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసున్నట్టు ఎస్సై తెలిపారు.