హైదరాబాద్ : ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో హిమాయత్ సాగర్ గేట్లు మూసివేసినట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది. మూడు గేట్లను మూసివేశామని, ఒక గేటు మాత్రమే రెండు ఫీట్ల ఎత్తు వరకు తెరిచి ఉందని అధికారులు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,763.50 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1.763.45 ఫీట్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 2.94 టీఎంసీలుగా ఉంది.
ఉస్మాన్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1790 ఫీట్లు. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది.