ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా(Adilabad) బేల మండలంలోని రేణిగూడ గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై(Laborers) తేనెటీగలు దాడి(Wasps attack) చేశాయి. సుమారు 100 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి స్థానికంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. ఇందులో తీవ్రంగా గాయపడిన 30 మందిని రిమ్స్కు తరలించారు. గాయపడిన వారిని మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) పరామర్శించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఉపాధి కూలీలతోపాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.