హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శుక్రవారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వేర్వేరుగా కలిశారు. మంత్రి కొండా సురేఖతో కలిసి సచివాలయంలో ఎంపీ పసునూరి దయాకర్ కలువగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం నివాసంలో రేవంత్ను కలిశారు.
దానం నాగేందర్ సీఎంను కలిసిన సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఉన్నారు.