KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కావ్య భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తనపై నమ్మకంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని కేసీఆర్ కావ్యను ఆశీర్వదించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్… pic.twitter.com/9oFLNr4LEd
— BRS Party (@BRSparty) March 26, 2024