నర్సంపేట, జనవరి 30: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 18 బీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్పై సొంతపార్టీ కౌన్సిలర్లే 15 మంది అవిశ్వాసం పెడుతున్నట్టు కలెక్టర్కు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేశారు.
ఎన్నికల అధికారి, ఆర్డీవో కృష్ణవేణిని మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. బీఆర్ఎస్కు చెందిన 14 మంది కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్రెడ్డి విప్ జారీ చేయడంతో వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కూడా ఎన్నికకు దూరంగా ఉంటామని మొదలే ప్రకటించారు. దీంతో చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్రెడ్డి చైర్పర్సన్ పోకడలను నియంత్రించలేదని పేర్కొన్నారు. అందుకు నిరసనగా తాము బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు 14 మంది కౌన్సిలర్లు ప్రకటించారు.