హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి, వరంగల్ ఎంపీ స్థానాలను తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ సమితి ఎస్సీ జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారిక లెకల ప్రకారం 63 లక్షల దళిత జనాభా ఉంటే అందులో మాదిగలు 25 లక్షలు, మాలలు 17 లక్షలు ఉండగా, మిగతా ఉపకులాల 22లక్షలని వెల్లడించారు. ఇప్పటివరకు పదవులన్నీ మాల, మాదిగలే అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో మాల, మాదిగల కంటే ఎస్సీ ఉపకులాలదే మెజారిటీ జనాభాని, ఆ రెండు స్థానాలను ఉపకులాలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తామని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.