హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని సీఎస్ సోమేశ్కుమా ర్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులనుండి ధా న్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మారెటింగ్, పౌర స రఫరాల అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్ర జాప్రతినిధులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ.1,960గా మద్ద తు ధర నిర్ణయించిందని, ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు. మొత్తం జిల్లా యంత్రాంగమంతా ధాన్యం కొనుగోలులో నిమ గ్నం కావాలని, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్లో రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలు వినియోగించుకోవాలని, గన్నీ బ్యాగుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రానిల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని, ప్రతి రోజు ధాన్యం సేకరణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.