హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, రైతు అనుకూల పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ వచ్చే నాటికి వ్యవసాయం దండుగగా మారి, రైతంటే పిల్లను ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉండేదన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతుబంధు పథకంతో అన్నదాతల తలరాతలు మారిపోయాయన్నారు.
సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరందిస్తూ, 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుల రుణాలను మాఫీ, రైతుబీమా ఇలా అనేక పథకాలతో రైతులు నేడు సంతోషంగా ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను, గత రెండేళ్లుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కరోనా వైరస్ లను, వాటి ద్వారా కలుగుతున్న కష్టాలను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేయాలన్నారు. రాబోయే కాలంలో ప్రజలు శాంతి సౌఖ్యాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.