హైదరాబాద్: ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను అభినందించారు. నగరంలోని మాదాపూర్లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 15వ ‘గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్’ జరిగింది. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవాలని సూచించారు. కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఫార్మాస్యూటికల్స్లో భారత్ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదని చెప్పారు. దేశంలో రోజురోజుకు మెడికల్ టూరిజం పెరుగుతున్నదని వెల్లడించారు. గ్రామీణ ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.