హైదరాబాద్: ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తెలంగాణలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. అయినా వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి ఓటరు స్లిప్పులు అందకపోవడంతో వాటిని ఓటర్లే నేరుగా పొందేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్లు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందా.. లేదా..? అని చెక్ చేసుకోవడంతోపాటు, సులువుగా ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓటర్ స్లిప్లో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి.