రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 2: చాకలి ఐలమ్మ సాక్షిగా తమ ఓటు ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బాల్క సుమన్కే వేస్తామంటూ రజక సంఘం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
బాల్క సుమన్కు తమ మద్దతు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి సుమన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇప్పటికే చెన్నూరు నాయీబ్రాహ్మణ సంఘం, అందుగులపేట, నర్సింగపూర్, రామారావుపేట గ్రామాలు, మందమర్రి 19వ వార్డు ప్రజలు బాల్క సుమన్కు ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన విషయం విధితమే. రజక సంఘం గౌర అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు నడిగొట తిరుపతి, సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి, కంచర్ల శ్రీనివాస్, జాలిగం శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.