సూర్యాపేట : అవయవ దానంతో పునర్జన్మ పొందినట్లే నని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తాను మరణిస్తూ మరొకరికి పునర్జన్మ ఇవ్వడం అంటే గొప్ప విషయమని ఆయన తెలిపారు. అలాంటి అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్పందన సేవా స్వచ్ఛంద సంస్థ అవయవ శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో దివంగత వనమా వెంకట్రామయ్య గుప్తా, గుండా వెంకటప్పయ్య గుప్తా స్మారకార్థం ఏర్పాటు చేసిన సేవాంకిత సంస్మరణ సభకు మంత్రి జముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం కోసం స్పందన స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనియమని కొనియాడారు. సూర్యాపేటలో బాల భవన్ ఏర్పాటులో దివంగత వనమా వెంకట్రామయ్య పాత్ర విస్మరించలేనిదన్నారు. సూర్యాపేట పట్టణంలో దివంగత వనమా వెంకట్రామయ్య గుప్తా, గుండా వెంకటప్పయ్య గుప్తా చేసిన సేవలకు గుర్తుగా వారి విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రధాన కూడళ్లకు వారి పేర్లను పెట్టనున్నట్లు మంత్రివెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ఉప్పల ఆనంద్, బండారు రాజా , రాచర్ల కమలాకర్, గుండా రమేష్, కోటయ్య, పిచ్చిరెడ్డి , ఇరిగి కొటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.