హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రిని వెస్ట్మారేడ్పల్లిలోని ఆయన గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతోమంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉకు పరిశ్రమకు కేంద్రం తన అనుచర వర్గానికి కట్టబెట్టే యోచనలో ఉందని దుయ్యబట్టారు. 780 రోజుల నుంచి తెలుగు రాష్ర్టాల ప్రజలు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రిని కలిసిన వారిలో కమిటీ సభ్యులు రాజ, శివ, శ్రీరామ్, సునీల్, మురళి, హరీశ్ తదితరులు ఉన్నారు.