Hyderabad | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం శుక్రవారం ప్రముఖులతో సందడిగా మారింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ ఒకేరోజు నగరంలో పర్యటించారు. కన్హాశాంతి వనాన్ని సందర్శించిన రాష్ట్రపతి అక్కడ నిర్వహించిన ఆధ్మాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ మల్కాజిగిరిలో 1.2 కిలోమీటర్ల మేర బీజేపీ రోడ్షోలో పాల్గొన్నారు. ప్రధాని రాత్రికి ఇక్కడే బస చేశారు. శనివారం మరో కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా శనివారం హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.