హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవుల గ్రామంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిపిన విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం రత్నారెడ్డితోపాటు ఆ అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసిన నార్సింగి మున్సిపల్ కమిషనర్ పీ సత్యబాబుపై హైకోర్టు కొరడా ఝళిపించింది. కోర్టు ధిక్కరణ నేరం కింద వారిద్దరికీ 6 నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ఎం లక్ష్మణ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.