హైదరాబాద్ : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతీ మంగళవారం యాదాద్రికి రానున్నారు. యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్తారు. కొద్దిసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని.. 10.45 గంటలకు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, 11.50 గంటలకు యాద మహర్షి విగ్రహాన్ని సందర్శించి, మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని.. విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారు.