సూర్యాపేట, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలిస్తుంటే పచ్చని పొలాల్లో కలుపు మొక్కల్లా విపక్ష పార్టీలు ఉనికి కోసం పాటు పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంట కండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అభివృద్ధి యాత్ర సాగుతుంటే ఇంకా ప్రజలకు ఉపయోగపడని పార్టీలు అవసరమా అని ప్రశ్నించారు.
అక్కడక్కడ విపక్షాలు ఏదో యాత్రలంటూ చేస్తున్నాయని వారు మోకాళ్ల యాత్రలు చేసినా ఒక్క సీటు కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. కొంతమంది లోపర్లు, జోకర్లు, బ్రోకర్ల మాటలకు ప్రజా క్షేత్రంలో విలువ లేదని ఆయన కొట్టి పడేశారు. సెప్టెంబర్ 2న జరుగనున్న జెండా పండుగను విజయవంతం చేయడంలో బాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంరలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ లీడర్, కాడర్తో విస్ర్తుత స్థాయి సమావేశాలు జిల్లా కేంద్రంలోని సుమంగళి, జీవీవీ ఫంక్షన్హాళ్లలో నిర్వహించారు.
ఈ సమావేశాలకు హాజరై మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వాలు రెండూ వేర్వేరు కాదని పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నది గులాబీ సైన్యం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోనే అధికారంలోకి వచ్చాక అమలు పరుస్తారని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ టీఆర్ఎస్ పార్టీ రూపొందించినవేనని ఆయన తేల్చిచెప్పారు. అటువంటి గులాబీ జెండాయే ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఆయన సుస్పష్టం చేశారు.
అక్కడక్కడా ఎగురుతునన జెండాల పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ఆసరా పింఛన్, రైతుబందు, కేసీఆర కిట్, మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ మంచి నీటి పథాకలు అమలవుతున్నాయా అన్నది గులాబీ సైన్యం తెలుసుకొని ప్రజల కు తెలియజెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అటువంటి పకీర్లు 2014కు ముందు పాలించినప్పుడు ఎందుకు 24 గంటల ఉచిత నిరంతర విద్యుత అందించలేక పోయిందో అన్నది తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు.
అదే విషయాన్ని మరింత లోతుగా తీసుకెళ్లి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాత్రల పేరుతో జాతర చేస్తున్న పార్టీలు ప్రధా ని మోడీ సొంత రాష్ట్రంలో ఎందుకు ఉచి త విద్యుత్ అమలు జరుగడం లేదన్నది ప్రజలకు తెలియజేయాలన్నారు. రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొనగా సమావేశాలకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
ఇంకా సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యయాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.