హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో జరిగిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో మాదిరిగా రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగానే పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
ఈ బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలుపడం వల్ల విషయం అంతా అగమ్య గోచరంగా మారుతున్నదని అన్నారు. రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెడితే.. కొత్త రైళ్లు ఎన్ని రానున్నా యి? ఎన్ని కొత్త రూట్లు వస్తున్నాయి? బడ్జెట్ ఎంత కేటాయించారు? వంటి సమగ్ర సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. రైల్వేశాఖను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డి మాండ్చేశారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాల నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఘన చరిత్ర కలిగిన రైల్వే ను ప్రైవేటుపరం చేయడం తగదని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి శంకర్రావు, రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సిన్హా, నాయకులు ఉన్నీ, సుంకప్ప, చంద్రమోహియార్, యుగంధర్, యాదవరెడ్డి, మోహన్బల్లా తదితరులు పాల్గొన్నారు.