B Vinod Kumar | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ భార్య మాధవితో కలిసి తిరుమలలోని జీఎంఆర్ గార్డెన్స్లో శనివారం మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుమల కొండపైనున్న జీఎంఆర్ గార్డెన్స్లో మొక్కలను నాటారు. ఆయన వెంట తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ తెలంగాణ అనుసంధాన అధికారి దొంత రమేశ్, హుజూరాబాద్ బీఆర్ఎస్ నేత చందమల్ల బాబు, బీసీ సంఘం నాయకులు బత్తిని రవీందర్ గౌడ్, ముక్క శ్రీనివాస్, బిట్ల వెంకటేశ్, అర్జున్, నాగార్జున రెడ్డి, మోహన్ రెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.