హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో ఐదుగురు విద్యార్థుల గల్లంతు పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో వినోద్ కుమార్ మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.
మృతి చెందిన మరో విద్యార్థి గణేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినోద్ కుమార్ సూచించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.