హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టు బెయిల్(Bail order) ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాం. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. కవితకు బెయిలు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది.
బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని తెలిపాఉ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. లిక్కర్ పాలసీ నిర్ణయం పైన కేసులు పెట్టారు. సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్కి అసలు తెలివి ఉందా?
చట్ట ప్రకారం కొట్లాడుదామనే..
సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరఫున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీం కోర్టులో
అటార్నీ జనరల్గా ఐదేళ్లు పని చేశారని గుర్తు చేశారు. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడుదామనే మేము ముందుకు వెళ్లామన్నారు. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.
ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారని ఆరోపించారు. కవిత బెయిల్ పై కొందరు కాంగ్రెస్ నేతలు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల పై వ్యాఖ్యానించే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడాలని భరత్ కుమార్ అన్నారు. ఈ తీర్పుకు రాజకీయాలకు సంబంధం లేదు. కోర్టును కించపరిచేలా మాట్లాడితే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామని హెచ్చరించారు.