కంటోన్మెంట్, మార్చి 9: రక్తదానంపై అపోహలు వద్దని.. ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నా రు. నార్త్జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ల్యాండ్స్తో కలిసి సంయుక్తంగా మంగళవారం కార్ఖానాలోని కేజేఆర్గార్డెన్స్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నార్త్జోన్ డీసీపీ కళ్మేశ్వర్తో కలిసి నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ సీపీ మాట్లాడుతూ .. అన్ని దానాల కన్నా గొప్పది రక్తదానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలునిచ్చారు. ఒక్కసారి రక్త దానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. కార్ఖానా సీఐ పరావస్తు మధుకర్స్వామి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసి రక్తదానం చేయడం సంతోషదాయకమన్నారు.
ఇదే స్ఫూర్తితో నగరంలోని రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను అభినందించి, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ శిబిరంలో సుమారు 350 మంది రక్తదానం చేశారు. ఇందులో ట్యాక్సీ డ్రైవర్లతో పాటు విద్యార్థులు, బస్తీవాసులు ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. సేకరించిన ఈ రక్తాన్ని ఆయా బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ ఉంచనున్నారు. కార్యక్రమంలో నార్త్జోన్ ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, భాస్కరన్, ఏసీపీ వినోద్కుమార్తో పాటు ఎస్సైలు అవినాశ్బాబు, నారాయణ, ఏఎస్సైలు సరళ, దీప్కౌర్, కానిస్టేబుళ్లు ప్రీతి, భార్గవి, తరుణి, శంకర్నాయక్, ఈశ్వర్, రాజేశ్, రాకేశ్, నాగేశ్వర్రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.