కడ్తాల్ : మహిళలు ముందుగానే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుండటంతో మహిళలంతా కేసీఆర్ చిత్రపటానికి రంగులు వేసి సంబురాలు నిర్వహించారు.