సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో నుంచి రూ.4 లక్షలు వెచ్చించి గ్రామంలో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటును గ్రామ అవసరాల కోసం వినియోగిస్తున్నాం. దీంతో ప్రతి నెలా రూ.10 వేల కరెంటు బిల్లు ఆదా అవుతున్నది. – మీనాక్షీ గాడ్గే, సర్పంచ్, ముక్రా(కే)