హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరులోగా సనత్నగర్ టిమ్స్ భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం టిమ్స్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. గడువులోగా సివిల్, మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ఎమర్జెన్సీ విభాగానికి అవసరమైన 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి ట్రయల్న్స్ నిర్వహించాలని, లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ బెడ్ రైలింగ్స్, సైన్ బోర్డులను సిద్ధం చేయాలని సూచించారు. నెలాఖరుకు పూర్తి సిబ్బంది నియామకం పూర్తవుతుందని తెలిపారు.