వికారాబాద్ : ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి పనుల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందువరుసలో నిలువడంపై చేవెళ్ల ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..మండలాల్లో కోట్పల్లి మండలం అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి ఇదే నిదర్శనం అన్నారు. అట్లాగే జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.