Vijayashanthi | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలిసింది. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పక్కనబెట్టారని, ఆ తర్వాత సమావేశాలకు కూడా పిలవడం మానేశారని అసహనం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల బీజేపీ వేసిన ఎన్నికల కమిటీల్లో ఆమెకు ఆందోళనల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.