ఆదిలాబాద్ : చారిత్రక వరంగల్ నగరంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. జిల్లాలోని ఖానాపూర్ మండలంలో టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని, నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసకున్న సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదించనున్నారు.