హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మధ్యాహ్న భోజన కార్మికులు తమకు వేతనం పెంచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీ వినోద్కుమార్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు గౌరవ వేతనంలో 40 శాతం రాష్ట్రం, 60 శాతం కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, బీజేపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేల గౌరవ వేతనంలో రూ.2,400 రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా, కేంద్రం వాటా కేవలం రూ.600 మాత్రమేనని, ఆ మొత్తం కూడా సరిగా ఇవ్వటం లేదని చెప్పారు.
పేదవిద్యార్థుల కడుపు నింపే సీఎం కేసీఆర్ మ ధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు నెలవారీగా బిల్లులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిషరిస్తామని తెలిపారు. సభలో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ, వరింగ్ ప్రెసిడెంట్ మంజుల, గురూజీ నర్సింగం, సంతోషి, సరోజ, వంట కార్మికులు పాల్గొన్నారు.