హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ బుధవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గగన్ మహల్లోని ఏవీ కాలేజీలో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 5.15 గంటల నుంచి కళాశాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉపరాష్ట్రపతితోపాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొననున్నారు.