హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై రాజకీయ నా యకురాలిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి, హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్రావు విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆమోదించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
తమిళిసై గతంలో రాజకీయ నాయకురాలని గుర్తుచేశారు. ఆమె ఇప్పుడు బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఇద్దరు నేతలు ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకోవడం దురుద్దేశ పూరిత మని మండిపడ్డారు. గవర్నర్ తన చర్యను వెనకి తీసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.