హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తామని శుక్రవారం టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. 1:3 నిష్పత్తి ప్రకారం జనరల్ అభ్యర్థులను, 1:5 నిష్పత్తి ప్రకారం పీడబ్ల్యూడీ అభ్యర్థులను ఎంపిక చేసిన జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, పీడబ్ల్యూడీ సర్టిఫికెట్లు, స్టడీ, రెసిడెన్షీ సర్టిఫికెట్ (క్లాస్ 1 నుంచి 7)వరకు, రిజర్వేషన్లు, రిలాక్సేషన్, అర్హతలకు సంబంధించిన ఈక్వెలెంట్ సర్టిఫికెట్లు వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు అభ్యర్థులకు సూచించారు.