హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, విప్ గువ్వల బాల్రాజ్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, పలువురు సీనియర్ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రముఖులు తరలివచ్చారు.
వేణుగోపాలాచారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేణుగోపాలాచారి సొంత జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శాలువాలతో సత్కరించారు. కార్పొరేషన్ ఎండీ విద్యాసాగర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.