హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదరరెడ్డికి నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్సీ పదవులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గెలిచిన వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీచేయడం, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడంలో ఆంతర్యమని ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ.. రాజకీయ విలువల్లేని వీరిద్దరికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.