హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయటం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హంతకులపై సానుభూతి అవసరం లేదని అన్నారు.
వారిని విడుదల చేయటం వేదనకు గురిచేసిందని చెప్పారు. ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయాలు వేర్వేరని పేర్కొన్నారు.