వేములవాడ, జూన్ 16: జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 9న విధులకు హాజరయ్యే క్రమంలో రఘు రోడ్డు దాటుతుండగా.. వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు.
ఆయన మరణవార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గల్ఫ్లోని తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడు చింతల్ఠాణం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు తిరుపతి, కంపెనీ ఆధ్వర్యంలో రఘు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. శనివారం ఆయన మృతదేహం వేములవాడకు చేరుకోనున్నదని కుటుంబసభ్యులు తెలిపారు.