వేములవాడ రూరల్, డిసెంబర్ 19: కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి శివారులో చోటుచేసుకున్నది. వేములవాడ మండలం చింతల్ఠాణాకు చెందిన 10 మంది చందుర్తి మండలం మర్రిగడ్డలో వరినాట్లు వేసేందుకు ఉదయం ఆటోలో వెళ్లారు.
తిరిగి సాయంత్రం వచ్చే క్రమంలో పోచెట్టిపల్లి వద్ద కోతి రోడ్డుకు అడ్డుగా రావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాతరగొండ మల్లవ్వ (55), బాలవ్వ(58) మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు.