వేములవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ.99.80 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వివరాలు వెల్లడించారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జా తర సమయంలో ఆలయానికి దండిగా ఆదాయం వస్తు న్నది. జాతర జరిగిన 2021-22లోనూ రూ.88 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మేడారం జాతర లేకున్నా రికార్డు స్థాయిలో దాదాపు 100 కోట్ల ఆదాయం వచ్చింది.