వేములవాడ టౌన్, జనవరి 21: మేడారం జాతర సమీపిస్తుండటంతో వేములవాడ రాజన్నకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఈ ఆదివారం నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆదివారాల్లో రాత్రివేళల్లోనూ స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. రాత్రివేళల్లోనూ కోడె, ఇతర మొక్కులు చెల్లించుకోవచ్చని సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.