హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వేములవాడ ఎమ్మెల్యే డా క్టర్ చెన్నమనేని రమేశ్బాబును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ హోదా పదవిలో ఆయన ఐదేండ్లపాటు కొనసాగుతారు. చెన్నమనేని రమేశ్బాబు జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక ‘హంబోల్ట్ యూనివర్సిటీ’ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనమిక్స్’లో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టా పొందారు.
వినూత్న వ్యవసాయ పథకాలు, పుష్కలమైన సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్గా, చెన్నమనేని రమేశ్బాబుకు ‘అగ్రికల్చర్ ఎకానమి’ అంశంపై ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్ఞానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చ్రందశేఖర్ రావు నిర్ణయించారు.