హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా వేద రజని గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, నోముల భగత్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్తోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా సీఎం కేసీఆర్కు రజని కృతజ్ఞతలు తెలిపారు.