నిజామాబాద్, ఫిబ్రవరి 18: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో కుక్కలను నిర్మూలించేందుకు గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న చర్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కొన్ని రోజులుగా గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వాహనదారులు, పాదచారుల వెంటపడుతున్నాయని గ్రామస్థులు వీడీసీ సభ్యులకు విన్నవించారు. గ్రామస్థులంతా సమావేశమై కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వీడీసీని కోరారు. స్పందించిన సభ్యులు కుక్కల నివారణకు ప్రత్యేక బృందాలను రప్పించి కుక్కలకు విషంతో కూడిన ఇంజెక్షన్లను ఇచ్చి చంపించినట్టు తెలిసింది. మరణించిన కుక్కల కళేబరాలను గోతి తీసి పాతిపెట్టినట్టు సమాచారం.