ఖైరతాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. నగరానికే తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన కార్లతో ప్రదర్శన నిర్వహించారు. కార్లపై హ్యపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి, ప్రదర్శించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టున్న తమ నాయకుడి చొరవతో ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్ విశ్వనగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని అరవింద్ పేర్కొన్నారు. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.