హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ నావల్ చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ (సీక్యూఏవో)గా వారణాసి చంటి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నావల్ ఇంజినీరింగ్ ఐఎన్ఎస్ శివాజీలో చదువుకున్న చంటి 1992లో భారత నౌకాదళంలో చేరారు. ఈ విభాగంలో మూడు దశాబ్దాల అనుభవమున్న ఆయన ఎన్నో సవాళ్లను సులువుగా పరిష్కరించారు.
ఎనిమిదేండ్లు సముద్రంలో ఉంటూ ఐఎన్ఎస్ తల్వార్, మైసూర్, ఆగ్రే, అమినీ వంటి ఫ్రంట్ లైన్ యుద్ధనౌకల్లో సేవలందించారు. రెండు డాక్ యార్డుల్లో దశాబ్దానికి పైగా సేవలందించారు. ప్రతిష్ఠాత్మక డీఆర్డీవో అగ్ని అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ సీక్యూఏవో (నావల్)గా నియమితులయ్యారు. భారత నావికాదళంలో 36 ఏండ్లపాటు సేవలందించి పదవీ విరమణ చేసిన కమోడోర్ ముఖేశ్కుమార్ నుంచి చంటి బాధ్యతలు స్వీకరించారు.