ముషీరాబాద్, నవంబర్ 23: ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే వర్గీకరణ దూరమవుతుందని టీఎస్ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మాదిగ బిడ్డలను పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గురువారం విద్యానగర్లోని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.
ఎన్నికల సమయంలో మరోమారు వర్గీకరణ అంటున్న కాంగ్రెస్ మాటలను నమ్మి మో సపోవద్దని సూచించారు. మాదిగల వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మోసం చేస్తూ వస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తలేదని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్కు వర్గీకరణ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.