ఆలేరు, నవంబర్ 19 : కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం ద్వారా మాదిగలను మరో పదేండ్లు వెనక్కి నెట్టడమే అవుతుందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. కాంగ్రెస్కు మద్దతుగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మాదిగ బిడ్డలైన సురేందర్, దామోదర్, మహేశ్ను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మోత్కుపల్లి సూచించడం సరికాదని అన్నారు.
ఆదివారం ఆయన ఆలేరులో మీడియాతో మాట్లాడారు. మాదిగ జాతికి న్యాయం చేసిన బీఆర్ఎస్ను వీడి బయటికి రావడమే ఆయన చేసిన పెద్ద తప్పని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పి ఇంకో తప్పు చేయవద్దని హితవు పలికారు. నాడు దళితబంధు పథకం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం మీటింగ్ పెడితే దానికి వెళ్లిన మోత్కుపల్లి సీఎం కేసీఆర్ను అభినవ అంబేద్కర్ అని కొనియాడిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
సీఎల్పీ నేత భటి ్టవిక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, వేణుగోపాల్, రాహుల్ గాంధీ దగ్గర ఉండే కొప్పుల రాజు అంతా మాలలేనని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు సమన్వయకర్తగా మోత్కుపల్లి ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గుండె ధైర్యం గొప్పదని మెచ్చుకున్న ఆయన ఇప్పుడు అహంకారి అని మాట్లాడటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్లో మోత్కుపల్లికి టికెట్ ఇస్తే ఇలా అనే వారా? అని ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపిన బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.