కేసముద్రం, జూలై 6: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం స్పల్పంగా దెబ్బతినగా కొంత భాగం ఊడిపోయింది.
ఎద్దు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. కాగా ఎద్దు అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో రైలు సుమారు 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆర్పీఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎద్దు కళేబరాన్ని తొలగించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.