ఖమ్మం రూరల్, జూలై 16: పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపెల్లి రామయ్య కు మారుడు సైదులు (50) గుండెపోటుతో మృతిచెందారు. సైదులు ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో కిరాణ దుకాణం నడుపుతున్నా డు. ఆదివారం షాపులో ఉండగా గుండెతోకుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తున్న వనజీవి రామయ్య కుమారుడి మరణవార్త విని వెనుదిరిగారు. కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించారు.